by సూర్య | Wed, Jan 06, 2021, 03:34 PM
డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసి కంలో ఫైనాన్షియల్ కంపెనీలు అద్భుతమైన వృద్ధిని సాధించాయి. ఎన్బీఎఫ్ సీ రంగంలో ప్రముఖ కంపెనీలైన బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కంపెనీలు మూడో త్రైమాసికంలో కార్యక లాపాల నిర్వహణలో గణనీయంగా మెరుగుపడ్డా యి. క్యు3లో 20.2 లక్షల మంది కొత్త కస్టమర్లను పొందా మని, మొత్తం కంపెనీ మొత్తం కస్టమర్ల బేస్ 46.3 మిలియన్లకు చేరిందని వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కస్టమర్ల సంఖ్య 40.4 మిలియన్ల నుంచి భారీగా పెరిగిందని కంపెనీ పేర్కొంది. కాగా కంపెనీ ఏయూఎం డిసెంబర్ త్రైమాసికంలో 4.6 శాతం మేర మెరుగుపడి రూ.1,43,700 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడిం చింది. క్యు3లో ఏయూ ఎం రూ.7,700 కోట్ల మేర పెరిగిందని వెల్లడించింది. క్యు3లో కొత్తగా 6 మిలియన్ల మంది కొత్త రుణాలు పొందారు. గతేడాది 7.7 మిలియన్లగా ఉన్నప్పటికీ భారీగా రికవరీ నమోదయిందని కంపెనీ వివరించింది.
Latest News