by సూర్య | Thu, Jan 07, 2021, 09:24 AM
విజయనగరం జిల్లా కోరాడపేట సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరుగడంతో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి మామిడి సతీశ్, రవికుమార్ విశాఖ జిల్లా పద్మనాభం మండలం రెడ్డిపల్లిలో జరిగే వివాహానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. విజయనగరం మండలం కోరుకొండ ప్రాంతానికి చెందిన ప్రజ్వల్, రవికుమార్, రాజులు బైక్పై కోరాడపేట వైపు వస్తున్నారు. ఈ క్రమంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మామిడి సతీశ్ (2౩), ప్రజ్వల్ (20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వ్యక్తుల్లో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News