by సూర్య | Mon, Oct 19, 2020, 04:07 PM
వరద వచ్చిన ప్రతిసారి ప్రభుత్వానికి చంద్రబాబు ఇల్లు ముంచాలనే తపన పడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండిపడ్డారు. చంద్రబాబు ఇంటిపై ఉన్న శ్రద్ద..వరదలకు నష్టపోయిన రైతులపై లేదన్నారు. వరదలు ప్రభుత్వం సృష్టించినవేనని చెప్పారు. లోకేష్ పర్యటన తర్వాతే మంత్రులు వరద ముంపు ప్రాంతాలకు వచ్చారని చెప్పారు. తాము రైతులను పరామర్శించిన తర్వాతే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిందని పేర్కొన్నారు. వరదలతో నష్టపోయిన ప్రజలకు రూ.500 భిక్ష వేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Latest News