జీజీహెచ్ కు మంత్రి శ్రీరంగనాథ రాజు కోటి రూపాయలు విరాళం

by సూర్య | Fri, Oct 16, 2020, 09:44 AM

గుంటూరు.రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు గురువారం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆసుపత్రి అభివృద్ధి కోసం కోటి రూపాయలు వ్యక్తిగత విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి వస్తున్న పేద ప్రజలకు గుంటూరు జీజీహెచ్ సేవలందిస్తున్న దని మంత్రి పేర్కొన్నారు. కొవిడ్ చికిత్సల్లో నూ జీజీహెచ్ కీలక పాత్ర పోషించిందని ఆయన ప్రశంసించారు. ఇకనుంచి జీజీహెచ్ లో చికిత్స పిందే రోగి తోపాటు వెంట వచ్చే సహాయకునికి సైతం రెండుపూటలా భోజన వసతి కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం తాను వ్యక్తిగతంగా కోటి రూపాయలు ఇస్తున్నానని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆసుపత్రిలో అసంపూర్తిగా వున్న నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రోగులకు చికిత్సకు అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టినట్టు ఆయన వివరించారు. కొవిడ్ రోగులకు అవసరమైన పడకలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మంత్రి వెంట రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, జిల్లా కలెక్టర్ శామ్యూల్.ఆనండకుమార్, సంయుక్త కలెక్టర్ ప్రశాంతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తదితరులున్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM