by సూర్య | Wed, Oct 14, 2020, 03:27 PM
న్యాయవ్యవస్థను బెదిరించడానికి జగన్ కుతంత్రాలు చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపై ఆరోపణల్లో ఎలాంటి హేతుబద్ధత లేదని, జగన్ రాసిన లేఖ కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ప్రజల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని వమ్ముచేసేలా జగన్ లేఖ ఉందని అన్న బార్.. రాజ్యాంగ వ్యవస్థలపై జగన్ దాడి చేయడం దురదృష్టకరమని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేయడమేనని తీవ్ర స్థాయిలో స్పందిస్తూనే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది.
Latest News