by సూర్య | Wed, Oct 14, 2020, 04:04 PM
సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై వచ్చిన అక్రమ మైనింగ్ ఆరోపణలపై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే అక్రమ మైనింగ్ జరగలేదని మైనింగ్ శాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో పిటిషనర్ దారుడు పేర్కొన్న ప్రతివాదులందరి తరపున కౌంటర్లు దాఖలు చేయాలని మైనింగ్ శాఖను ధర్మాసనం ఆదేశించింది. ప్రైవేట్ ప్రతివాదులు కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పేర్కొంది. ఈ కౌంటర్లపై రిజైండర్ కూడా వెంటనే దాఖలు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది నాగరఘును న్యాయస్థానం ఆదేశిస్తూ..కేసు తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Latest News