by సూర్య | Wed, Oct 14, 2020, 03:20 PM
ఆంధ్రప్రదేశ్కు చెందిన 13 జిల్లాల సినిమా ఎగ్జిబిటర్లు బుధవారం విజయవాడలో సమావేశం అయ్యారు. గురువారం నుంచి సినిమా థియేటర్లు తెరవాలా? వద్దా? అన్నదానిపై చర్చలు జరిపారు. చివరికి రేపటి నుంచి థియేటర్లు తెరవకూడదని నిర్ణయించారు. థియేటర్లు తెరవాలంటే ఒక్కో దానికి రూ.10 లక్షల అదనపు ఖర్చు అవుతుందని, 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్ల నిర్వహణ కష్టమని ఎగ్జిబిటర్లు భావించి.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిక్స్డ్ విద్యుత్ ఛార్జీలు ఎత్తివేయాలని ఎగ్జిబిటర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Latest News