జగన్‌ నీరో చక్రవర్తిలా మారారు : రఘురామకృష్ణ

by సూర్య | Wed, Oct 14, 2020, 02:59 PM

సీఎం జగన్‌పై నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘జగన్‌ నీరో చక్రవర్తిలా మారారు. రోడ్లు లేకపోయినా గన్నవరం వెళ్లేందుకు సీఎంకు హెలికాఫ్టర్‌ ఉంది. ఇంటింటికీ హెలికాఫ్టర్స్‌ పథకం పెడతారా? రాష్ట్రంలో పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని రాష్ట్రపతికి లేఖ రాశా. జగన్‌ మనసు తెలియకనే వైసీపీలో చేరా. ఏపీలో పాలెగాళ్ల పరిపాలన నడుస్తోంది. ఉత్తరాంధ్రకు విజయసాయిరెడ్డి ఒక పాలెగాడు. మా నియోజకవర్గంలో ఓ పాలెగాడు ఆవ భూముల్లో అవినీతి చేశారు. అమరావతి రైతులపై సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు బాధాకరం. పిచ్చి మాటలు మాట్లాడటం మంచిది కాదు. సీఎం బాబాయ్ ఆవ భూముల్లో అవినీతి చేశారని ప్రజలు అనుకుంటున్నారు. పార్లమెంట్‌లో మీ సామాజికవర్గం వారికి పదవులు ఇచ్చారు. జగతి పబ్లికేషన్స్‌లో బాలశౌరి పెట్టుబడులపై సీబీఐకి ఫిర్యాదు చేశా. త్వరలో విచారణ జరుగుతుంది’ అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

Latest News

 
రేపు కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నా చంద్రబాబు, పవన్ కల్యాణ్ Tue, Apr 16, 2024, 10:50 PM
ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల కోడ్ వర్తిస్తుంది : కేంద్ర ఎన్నికల సంఘం Tue, Apr 16, 2024, 10:30 PM
వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్‌ మంజూరు Tue, Apr 16, 2024, 09:36 PM
ప్రచారంలో అపశ్రుతి.. ఆవేశంగా ప్రసంగిస్తూ కిందపడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి Tue, Apr 16, 2024, 08:20 PM
ఏపీలో పెరిగిన ఎండల తీవ్రత, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక Tue, Apr 16, 2024, 08:14 PM