by సూర్య | Mon, Oct 12, 2020, 08:12 PM
అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ ఉద్యమం చేపట్టి 300 రోజులు అయింది. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. కానీ ప్రభుత్వంలో పని చేస్తున్న కొందరు ప్రజా ప్రతినిధులు మాత్రం ఇప్పటికీ ఆక్రోశాన్ని వెల్లగక్కుతూనే ఉన్నారు. ఉద్యమకారులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘‘300వ రోజు కూడా తొలి రోజు నాటి విశ్వాసం. బాధ్యత మరిచి ఎగతాళి చేస్తున్న రాజ్యం. సూటిపోటి మాటలతో కుళ్లబొడుస్తున్న శాడిజం. ప్రాంతాయ విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలు భగ్నం. చిచ్చు పెట్టాలనే ప్రయాత్నాలను తిప్పికొట్టిన నినాదం. కరోనా కాలంలలోనూ కదలని ఆశయ శిబిరం. వంద గుండెలు ఆగినా గుండె చెదరని నిబ్బరం.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.
Latest News