విశాఖ తెన్నేటి పార్క్ వద్ద సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ భారీ నౌక

by సూర్య | Tue, Oct 13, 2020, 01:17 PM

విశాఖ తెన్నేటి పార్క్ వద్ద సముద్రపు ఒడ్డుకు ఓ భారీ నౌక కొట్టుకురావడంతో దాన్ని చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఆ భారీ నౌక బంగ్లాదేశ్‌కు చెందినదని సమాచారం.  గత రాత్రి గాలుల తాకిడి అధికంగా ఉండడంతో అది ఇలా అదుపుకోల్పోయి తీరానికి కొట్టుకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.


అలల తాకిడికి ఔటర్ హార్బర్‌లో యాంకర్ తెగి ఒడ్డుకు వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది తీరానికి సమీపంలో ఇసుకలో కూరుకుపోయింది. అందులో దాదాపు 15మంది సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మెరైన్ పోలీసులు, పోర్టు సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM