వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ : జగన్

by సూర్య | Mon, Oct 12, 2020, 06:00 PM

ఏపీ సీఎం జగన్ విద్యుత్ శాఖ, వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ఆదేశించారు. మోటార్లకు మీటర్లు బిగించే క్రమంలో రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.


ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా ఇకపై విద్యుత్ బిల్లులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు. రైతులు అదే నగదును విద్యుత్ బిల్లుల కింద డిస్కంలకు చెల్లిస్తారని వివరించారు. ఈ విధానం ద్వారా వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ ను అందించే వీలుందని అన్నారు. మీటర్ల సేకరణ, ఏర్పాటులో నాణ్యతకే పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM