by సూర్య | Mon, Oct 12, 2020, 06:32 PM
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. వెంకయ్యనాయుడుకు ఎయిమ్స్ వైద్యబృందం సోమవారం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించింది. వెంకయ్యకు కరోనా నయమైందని వెల్లడి కావడంతో అందరిలోనూ నిశ్చింత ఏర్పడింది.
వెంకయ్యనాయుడుకు కరోనా అంటూ సెప్టెంబరు 29న ఓ ప్రకటన వెలువడింది. అప్పటినుంచి వెంకయ్యనాయుడు హోం క్వారంటైన్ లోనే ఉన్నారు. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చిందన్న నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. త్వరలోనే వెంకయ్యనాయుడు అధికారిక విధులకు హాజరవుతారని, డాక్టర్ల సూచనల మేరకు వ్యవహరిస్తారని ఓ ప్రకటన చేసింది.
Latest News