ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా నెగిటివ్

by సూర్య | Mon, Oct 12, 2020, 06:32 PM

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. వెంకయ్యనాయుడుకు ఎయిమ్స్ వైద్యబృందం సోమవారం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించింది. వెంకయ్యకు కరోనా నయమైందని వెల్లడి కావడంతో అందరిలోనూ నిశ్చింత ఏర్పడింది.


వెంకయ్యనాయుడుకు కరోనా అంటూ సెప్టెంబరు 29న ఓ ప్రకటన వెలువడింది. అప్పటినుంచి వెంకయ్యనాయుడు హోం క్వారంటైన్ లోనే ఉన్నారు. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చిందన్న నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. త్వరలోనే వెంకయ్యనాయుడు అధికారిక విధులకు హాజరవుతారని, డాక్టర్ల సూచనల మేరకు వ్యవహరిస్తారని ఓ ప్రకటన చేసింది.

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM