by సూర్య | Mon, Oct 12, 2020, 05:09 PM
ఏపీ హైకోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వ్యాఖ్యలు కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి సీఐడీ చేస్తున్న విచారణపై హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది వారాల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. సీబీఐకి ఏపీ ప్రభుత్వం కూడా సహకరించాలని హైకోర్టు పలు సూచనలు చేసింది. ఇకపోతే ఏపీలో కోర్టులు, తీర్పులు, జడ్జిలను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో పలువురు అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Latest News