బీజేపీలో చేరిన కుష్బూ

by సూర్య | Mon, Oct 12, 2020, 02:14 PM

త‌మిళ సినీ న‌టి ఖుష్బూ సుంద‌ర్ ఇవాళ బీజేపీలో చేరారు.  ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆమె కాషాయం కండువా క‌ప్పుకున్నారు. ఢిల్లీలో జ‌రిగిన చేరిక కార్య‌క్ర‌మంలో కుష్బూకు పార్టీ అభ్య‌ర్థిత్వాన్ని సంబిత్ పాత్రా అందించారు. గ‌త ఆరేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేశారు.  ఏఐసీసీ ప్ర‌తినిధి హోదా నుంచి ఖ‌ష్బూను త‌ప్పించ‌డంతో ఆమె ఆ పార్టీకి గుడ్‌బై చెప్పింది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న‌త స్థాయిలో ఉన్న కొంద‌రు .. గ్రౌండ్ రియాల్టీ తెలియ‌కుండానే ఆదేశాలు ఇస్తున్నార‌ని, ఇది న‌చ్చ‌క‌నే కాంగ్రెస్ పార్టీని వీడుతున్న‌ట్లు ఖుష్బూ ఇవాళ త‌న  రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు.  2014 నుంచి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.  రాబోయే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి ఖుష్బూ పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. త‌మిళ‌నాడులో బీజేపీ ముఖ‌చిత్రాన్ని ఖుష్బూ మార్చేస్తుంద‌ని కొంద‌రు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. 


గ‌తంలో ఆమె డీఎంకేలో కూడా చేరారు.  2010లో డీఎంకే అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఖుష్బూ ఆ పార్టీకి ప‌నిచేశారు.   ఆ త‌ర్వాత నాలుగేళ్ల‌కు ఆ పార్టీని వీడిన ఖుష్బూ.. సోనియా గాంధీతో భేటీ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరింది. కానీ 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వ‌లేదు.  

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM