by సూర్య | Mon, Oct 12, 2020, 08:43 AM
టాప్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్కు ముంబై ఇండియన్స్ షాక్ ఇచ్చింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చివరకు ముంబై విజయఢంకా మోగించింది. ఓపెనర్ రోహిత్ శర్మ(5) వెంటనే అవుటైనా మరో ఓపెనర్ క్వింటన్ డీకాక్(36 బంతుల్లో 53) ఫామ్లోకి రావడం ముంబైకి కలిసొచ్చింది. డీకాక్తో పాటు సూర్య కుమార్ యాదవ్(32 బంతుల్లో 53) కూడా అర్థ సెంచరీతో మెరిశాడు. వీరిద్దరికీ తోడు ఇషాన్ కిషన్(15 బంతుల్లో 28) కూడా రాణించడంతో ముంబై విజయానికి చేరువైంది. చివర్లో బర్త్డే బాయ్ హార్దిక్ పాండ్యా(0) డకౌట్గా వెనుదిరిగినా.. పొలార్డ్(11 బంతుల్లో 11), కృనాల్ పాండ్యా(7 బంతుల్లో 12) లాంచనాన్ని ముగించారు.
దీంతో మరో రెండు బంతులు మిగిలుండగానే ముంబై విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఢిల్లీ మూడు మ్యాచుల తరువాత పరాజయం చవి చూసింది. అయితే ముంబై మాత్రం వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల టేబుల్లో అగ్రస్థానానికి చేరింది.
Latest News