సైనిక పెరేడ్ లో భారీ క్షిపణిని ప్రదర్శించిన ఉత్తర కొరియా

by సూర్య | Sun, Oct 11, 2020, 04:16 PM

ఉత్తర కొరియాలో అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవం నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైనిక పెరేడ్ లో భారీ క్షిపణిని ప్రదర్శించారు. ఇది ఖండాంతర అణుక్షిపణిగా భావిస్తున్నారు. దీని సైజు దృష్ట్యా అంతర్జాతీయ మీడియాలో రాక్షస క్షిపణి అని అభివర్ణిస్తున్నారు. కాగా ఓ పెరేడ్ లో బహిరంగంగా ప్రదర్శించిన మిస్సైళ్లలో ఇదే అతిపెద్దది అని అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య పేర్కొంది. ఈ బాహుబలి క్షిపణికి అమెరికా రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.


కాగా, ఈ సైనిక ప్రదర్శనకు ఉత్తర కొరియా సైనికులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్న కూడా పెరేడ్ లో పాల్గొన్నట్టు అక్కడి అధికారిక మీడియా ఓ వీడియో విడుదల చేసింది. భారీ మిస్సైల్ వాహనం వెళుతుండగా కిమ్ జాంగ్ ఉన్ అభివాదం చేస్తుండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఇటీవల కాలంలో కిమ్ బహిరంగంగా కనిపించడం చాలా అరుదైన విషయంగా మారింది.

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM