by సూర్య | Sun, Oct 11, 2020, 03:25 PM
అమరావతి అంటే లక్ష కోట్ల సంపద సృష్టికి కేంద్రమని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ భవిష్యత్ భావితరాలకు అమరావతి ఉద్యోగ ఉపాధికి కేంద్రమన్నారు. ఆనాడు ఏపీ రాజధానిగా అమరావతిని టీడీపీ ప్రభుత్వం ప్రకటించినప్పుడు..ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి స్వాగతించారన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని విమర్శించారు. జగన్ మూడుముక్కలాట రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. రాజధాని కోసం వేలాది ఎకరాలు త్యాగం చేసిన రైతులకు అండగా ఉంటామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
Latest News