by సూర్య | Fri, Oct 09, 2020, 01:55 PM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలనని నిర్ణయించింది. మూడు రోజుల పాటు సాగిన ఆర్బీఐ పరపతి సమీక్ష అనంతరం బోర్డు నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ ఉదయం వెల్లడించారు. రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగుతాయని శక్తికాంత్ దాస్ తెలిపారు. ఆర్థిక వృద్ధి నిదానంగా సాగుతున్న వేళ, వడ్డీ రేట్లను మరింతగా తగ్గించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామన్నారు.
Latest News