by సూర్య | Fri, Oct 09, 2020, 01:24 PM
వెలిగండ్ల మండలంలో దారుణం జరిగింది. చిన్నారిని కామాంధుడు కాటేశాడు. తల్లి పనుల కోసం బయటకు వెళ్లగా గ్రామానికి చెందిన 47 ఏళ్ల వ్యక్తి కరివేపాకు కోసిస్తానని బాలికకు మాయమాటలు చెప్పాడు. తన బండిపై చిన్నారికి పొలానికి తీసుకువెళ్లాడు. అయితే ఇంటికొచ్చిన బాలిక ఏడుస్తుండడంతో తల్లి ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అయితే బాలికది, నిందితుడిది ఒకే సామాజికవర్గం కావడంతో రాజీకి ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Latest News