by సూర్య | Thu, Oct 08, 2020, 04:58 PM
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలపై ఏపీ ప్రభుత్వ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'నిరసన తెలుపుతూ ప్రత్యేక ప్యాకేజీ కింద వచ్చిన ఆర్థిక సహాయాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ.. ఈ రోజు వైఎస్ జగన్ గారు గాని తీసుకుని ఉండాల్సింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. ముందు ప్యాకేజీ తీసుకొని హోదా కోసం పోరాటం కొనసాగించవచ్చు. లేకపోతే రెంటికీ చెడ్డ రేవడిల మయే ప్రమాదం ఉంది అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యలను ఆయన పోస్ట్ చేశారు.
ఏపీ డిమాండ్ చస్తోన్న పెండింగ్ రెవెన్యూ లోటు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు సంబంధించినదని, ఆ సంఘం గడువు తీరిపోయిందని నిర్మలా సీతారామన్ నిన్న తెలిపినట్లు అందులో ఉంది. అంతేగాక, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఇచ్చి ఏడాది గడిచిపోయిందని, దాని అమలు కూడా ప్రారంభమైందని ఆమె పేర్కొన్నారు.