నా ఇంట్లో ఎలాంటి సోదాలు జరగడంలేదు : రఘురామకృష్ణ

by సూర్య | Thu, Oct 08, 2020, 04:56 PM

తన నివాసం, కార్యాలయాలపై సీబీఐ దాడులు అంటూ ప్రచారం జరుగుతోందంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తన ఇంట్లో ఎలాంటి సోదాలు జరగడంలేదని స్పష్టం చేశారు. సోదాలు అన్న వార్త మీడియా ద్వారానే తెలుసుకున్నానని పేర్కొన్నారు. ఢిల్లీలో కానీ, హైదరాబాద్ లో కానీ, తన నియోజకవర్గంలో కానీ ఎక్కడా తన నివాసాలపైనా, తన కార్యాలయాలపైనా సీబీఐ దాడులు జరగలేదని వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని తమకు ఎవరూ ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు.


"నా ఇంటికి, నా ఆఫీసుకు ఏ అధికారులు రాలేదు. ఎక్కడా సోదాలు జరగలేదు.నేను కూడా మీడియాలో చూసే ఈ విషయం తెలుసుకున్నా.  మీడియాలో చూపిస్తున్న ఇళ్లు ఎవరివో, ఎక్కడివో మరి!" అంటూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

Latest News

 
రాష్ట్ర ప్రయోజనాలకోసమే సమర్ధించాం Fri, Apr 26, 2024, 06:44 PM
గుడివాడలో గెలుపెవరిది? Fri, Apr 26, 2024, 06:44 PM
ఓటు కోసం ఊరులు దాటుతున్న నేతలు Fri, Apr 26, 2024, 06:43 PM
తెనాలి పోలీసులపై చర్యలు Fri, Apr 26, 2024, 06:43 PM
వైరల్ అవుతున్న భువనేశ్వరి ఆడియో, అని ఫేక్ అంటున్న లోకేష్ Fri, Apr 26, 2024, 06:42 PM