ప్రియాంక గాంధీ తనయుడు రైహాన్ తీసిన ఫోటో వైరల్...

by సూర్య | Thu, Oct 08, 2020, 04:18 PM

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తనయుడు రైహాన్ రాజీవ్ వాద్రా గురించి ఇప్పటివరకు తెలిసింది చాలా తక్కువ. అయితే ఒక్క ఫొటోతో రైహాన్ విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫొటోగ్రఫీ పట్ల ఎంతో మక్కువ చూపే ప్రియాంక తనయుడు ఇటీవలే ఓ పులిని ఫొటో తీశాడు.


రాజస్థాన్ లోని సుప్రసిద్ధ రణథంబోర్ నేషనల్ పార్క్ ను సందర్శించిన రైహాన్ అక్కడ చెట్ల నీడలో విశ్రమిస్తున్న పులిని తన కెమెరాలో బంధించాడు. ఆ పులి ఓ కంటితో తనవైపే చూస్తున్న దృశ్యాన్ని రైహాన్ అత్యంత ఒడుపుగా క్లిక్ మనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది.


ప్రియాంక గాంధీ తనయుడ్ని చాలామంది మొదటిసారి చూడడం ఒకెత్తయితే, అతడు తీసిన ఫొటో మరో ఎత్తు. మొత్తమ్మీద నెటిజన్ల దృష్టిలో రైహాన్ రాజీవ్ వాద్రా ఓ వైల్డ్ ఫొటోగ్రాఫర్ గుర్తింపు అందుకుంటున్నాడు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM