by సూర్య | Thu, Oct 08, 2020, 11:26 AM
దేశంలో విలయతాండవం సృష్టిస్తోన్న కరోనా వైరస్ను కలిసికట్టుగా తరిమేద్దామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా నివారణకు ప్రజల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం జన్ ఆందోళన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గుర్తుంచుకోవాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి.. భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. నిత్యం చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఇద్దరి మధ్య రెండు గజాల దూరం ఉండేలా ప్రాక్టీస్ చేయండి. ఈ నియమాలు పాటించి కరోనాపై విజయం సాధిద్దామని మోదీ పిలుపునిచ్చారు.
आइए, कोरोना से लड़ने के लिए एकजुट हों!
हमेशा याद रखें:
मास्क जरूर पहनें।
हाथ साफ करते रहें।
सोशल डिस्टेंसिंग का पालन करें।
‘दो गज की दूरी’ रखें।
#Unite2FightCorona pic.twitter.com/L3wfaqlhDn
— Narendra Modi (@narendramodi) October 8, 2020