by సూర్య | Thu, Oct 08, 2020, 11:24 AM
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వరుసగా కరోనా కేసులు పెరుగుతూ ఆందోళన చెందుతున్న సమయంలో మొన్న కేసులు గట్టిగానే తగ్గాయి. సుమారు అరవై వేల కేసులే నమోదయ్యాయి. అయితే తాజాగా ఆ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశ్యాప్తంగా 78,524 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 971 మంది మృతిచెందారు.
దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 68,35,656కి చేరుకున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,02,425 యాక్టివ్ కేసులు ఉండగా 58,27,705 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 1,05,526 మంది మృతిచెందారు. మరోవైపు.. మంగళవారం రోజు 11,94,321 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.. దీంతో.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ల సంఖ్య 8,34,65,975 కు చేరినట్టు పేర్కొంది ఐసీఎంఆర్.