by సూర్య | Thu, Oct 08, 2020, 11:31 AM
రామజన్మభూమి ఆలయం కోసం తమిళనాడులోని రామేశ్వరంలో సిద్ధంచేసిన 613 కిలోల గంట బుధవారం అయోధ్యకు చేరింది. కంచుతో తయారైన ఈ భారీ గంటను మోగిస్తే ‘ఓం’ అన్న శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరం వినిపిస్తుంది. ఈ మేరకు తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన భక్తురాలు రాజ్యలక్ష్మి ప్రత్యేక వాహనంలో గంటను అయోధ్యకు తీసుకెళ్లారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు బుధవారం అందజేశారు. ఈ గంటను భవ్య రామమందిరంలో ఏర్పాటుచేస్తామని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ‘‘రాముడి ఆలయానికి గంటను బహూకరించడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ మహత్తర కార్యంలో నాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని రాజ్యలక్ష్మి చెప్పారు.
Latest News