యూపీ లో మరో దారుణం... పరువుకోసం బాలికను చంపిన వైనం...

by సూర్య | Wed, Oct 07, 2020, 04:29 PM

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో కొన్ని రోజుల క్రితం ఓ యువతి హత్యాచారానికి గురైన ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఆ ఘటనను మరవకముందే అదే రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల దళిత బాలిక పరువు హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఆ బాలికను తండ్రి, సోదరుడే తీవ్రంగా హింసించి గొంతు కోసి చంపేశారు.


అనంతరం బాలిక తలను శరీరం నుంచి వేరుచేసి ఖననం చేశారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు తెలిపారు. షహజన్‌పూర్‌ జిల్లాలో ఓ బాలిక గర్భం దాల్చింది. దీంతో గ్రామంలో ఆమె కారణంగా తమ పరువుపోతోందని ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి, సోదరుడు దారుణంగా హత్య చేసి, ఖననం చేశారు.


గత నెల  23న ఆ బాలిక అదృశ్యమైందని, అయినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం లభ్యం కావడంతో కేసును ఛేదించామని చెప్పారు. ఆ బాలిక తండ్రి నేరాన్ని అంగీకరించాడని, ఆమె సోదరుడు పరారీలో ఉన్నాడని వివరించారు. మైనర్‌ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకోవడం నేరమని, ఆమెకు గర్భం రావడానికి బాధ్యుడైన వారిని పట్టుకుంటామని చెప్పారు.

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM