by సూర్య | Sun, Mar 29, 2020, 02:24 PM
స్పైస్జెట్లో పైలట్గా పని చేస్తున్న ఓ వ్యక్తి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆదివారం సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే అతను మార్చి నెలలో ఎటువంటి అంతర్జాతీయ విమానం నడుపలేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా స్పైస్జెట్ సదరు ఉద్యోగి మార్చి 21వ తేదీన చివరిగా చెన్నై నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ డొమెస్టిక్ విమానాన్ని నడిపాడని, అప్పటి నుంచి అతను తన ఇంట్లో క్వారెంటైన్లోనే ఉన్నాడని ప్రకటించింది.
Latest News