by సూర్య | Sun, Mar 29, 2020, 02:22 PM
తప్పనిసరి పరిస్థితుల్లో దేశంలో లాక్ డౌన్ విధించాల్సి వచ్చిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. లాక్ డౌన్ తో పాటు అంక్షల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని.. అందుకు తనను క్షమించాలని దేశ ప్రజలను ప్రధాని కోరారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని రోజుల పాటు లక్ష్మణ రేఖ దాటకుండా ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. కరోనా కట్టడికే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ప్రజలు అర్థం చేసుకోవాలని వేడుకున్నారు.
Latest News