ఢిల్లీ విడిచి వెళ్ళకండి

by సూర్య | Sun, Mar 29, 2020, 01:45 PM

దేశవ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న రోజువారీ కూలీలు కాలినడకన తమ తమ స్వస్థలాలు తరలివెళ్తున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో దేశ వ్యాప్త లాక్‌డౌన్ సందర్భంగా వలస కూలీలెవ్వరూ ఢిల్లీ విడిచి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. వారి నిత్యావసరాలు తీర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని, అందుకోసం కృషి చేస్తూనే ఉన్నామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ కూలీలెవ్వరూ ఎటూ కదలకుండా ఢిల్లీలోనే ఉండాలని కోరారు. అందరూ గుమిగూడితే కరోనా మరింతగా వ్యాప్తి చెందే అవకాశముందని, వారి ద్వారా చిన్న చిన్న పల్లెలకు కూడా సోకితే అప్పుడు ఈ మహమ్మారిని ఎదుర్కోవడం కష్టతరమవుతుందని కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా వలస కూలీలకు విజ్ఞప్తి చేశారు.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM