by సూర్య | Sun, Mar 29, 2020, 01:42 PM
కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండడంతో మందులు, మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు, గ్లోవ్స్ కొరత రాకుండా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథార్టీ (NPPA) చర్యలు చేపట్టింది. వాటిని అందుబాటులో ఉంచాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశం జారీ చేసింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో మాస్కులు, శానిటైజర్ల కొరత బాగా కనిపిస్తుండడమే ఇందుకు కారణం. ఉత్పత్తిని పెంచేందుకు జిల్లాల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సూచించింది. తయారీ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, కెమిస్ట్ అసోసియేషన్ అందరూ కలిసి... అత్యవసరాలు అందుబాటులో ఉండేలా చెయ్యాలని ఎన్ పీపీఏ ఆదేశించింది.
Latest News