జమ్మూ కశ్మీర్‌లో కరోనాతో రెండో మరణం

by సూర్య | Sun, Mar 29, 2020, 01:37 PM

కరోనా మహమ్మారి దేశంలో ఎన్నో ప్రాణాలను పొట్టనబెట్టుకొంటోంది. తాజాగా జమ్మూ కశ్మీర్‌లో కరోనా వైరస్‌తో బాధపడుతున్న వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. బాధితునికి 62 సంవత్సరాలు, ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లాలోని టాంగ్‌మార్ నివాసి. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు బాధితుడు ఛాతీ వ్యాధుల ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు ప్రభుత్వ అధికారి మీడియాకు చెప్పారు. అతను కరోనా పాజిటివ్‌ అని తేలగానే ఎంఎంహెచ్‌ఎస్ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని శనివారం సాయంత్రం వెంటిలేటర్‌ పై ఉంచామని, ఇంతలోనే ఈ రోజు తెల్లవారుఝామున ఆ వ్యక్తి మృతి చెందారు.

Latest News

 
ఎగ్గొట్టడం బాబుకి అలవాటే Thu, May 02, 2024, 08:26 PM
ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్‌పై విషప్రచారం ఎందుకు బాబు? Thu, May 02, 2024, 08:26 PM
వైసీపీ మేనిఫెస్టో బ్రహ్మాండం Thu, May 02, 2024, 08:25 PM
నిరుపేదలే వైసీపీ స్టార్‌ క్యాంపెయినర్లు Thu, May 02, 2024, 08:24 PM
రేపు నరసాపురంలో పర్యటించనున్న సీఎం జగన్ Thu, May 02, 2024, 08:23 PM