by సూర్య | Sat, Mar 28, 2020, 02:35 PM
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట లేకుండా పోయింది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం నాటికి చైనా, ఇటలీని దాటేసి అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన అమెరికాలక్ష మార్క్ దాటిన తొలి దేశంగా నేడు రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఏ దేశంలోనూ లక్ష కేసులు నమోదైన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని మట్టుబెట్టేందుకు పాలకపక్షం అన్ని చర్యలు తీసుకుంటోందని పునరుద్దాటించారు. ఇప్పటికే అన్ని మార్గాల్ని అన్వేషించి ఆచరణలోకి తెచ్చిన శ్వేతసౌధం ఆఖరి రాష్ట్రాల్లో ఒకటైన డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ని కూడా తాజాగా అమల్లోకి తెచ్చిందంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తోంది.
Latest News