by సూర్య | Sat, Mar 28, 2020, 02:33 PM
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ మేరకు 64 దేశాలకు 174 మిలియన్ డాలర్ల నిధులను అందజేయనున్నట్లు శుక్రవారం తెలిపింది. అందులో భాగంగా భారత్కు 2.9 మిలియన్ డాలర్లు కేటాయించారు. కాగా ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఇది అదనం. కాగా భారత్కు ఇచ్చిన నిధులతో ల్యాబోరేటరీ వ్యవస్థలు, కరోనా సోకిన వ్యక్తుల గుర్తింపు, బాధితులపై నిరంతర పర్యవేక్షణ, ఇతర సాంకేతికత సదుపాయాలను సమకూర్చుకోవడానికి ఉపయోగించుకోవాలని సూచించారు.
Latest News