by సూర్య | Sat, Mar 28, 2020, 02:00 PM
కరోనా మహమ్మారి ఇటలీలో నానాటికి మరణమృదంగం మోగిస్తోంది. తాజాగా శుక్రవారం ఇటలీలో కరోనా వైరస్ ఉగ్రరూపమే దాల్చింది. నిన్న ఒక్కరోజే 969 మంది ప్రాణాలను బలిగొంది. దీంతో ఇప్పటి వరకు అక్కడ 9,134 మంది మృత్యువాతపడగా, బాధితుల సంఖ్య 86,500కు పెరిగింది. మరోవైపు కరోనా నేపథ్యంలో వైరస్ కట్టడికి సమగ్ర కార్యాచరణ రూపకల్పనకు ఐరోపా సమాఖ్య ఎలాంటి చొరవ చూపకపోవడంపై అనేక దేశాలు మండిపడుతున్నాయి.
Latest News