by సూర్య | Sat, Mar 28, 2020, 01:26 PM
ఒడిశా రాష్ట్ర అసెంబ్లీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగిని ఐసోలేషన్ గదికి తరలించారు. దీంతో ఒడిశా అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులందరికీ ముందుజాగ్రత్తగా పరీక్షలు చేయించి వారిని క్వారంటైన్ చేశారు. ఈ నెల 30 వతేదీ నుంచి ఒడిశా అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ భవనాన్ని శానిటైజ్ చేయించి ఖాళీ చేయించారు. కరోనా రోగి అసెంబ్లీ భవనంలో తిరిగిన నేపథ్యంలో ఈ నెల 30వతేదీ నుంచి జరిగనున్న అసెంబ్లీ సమావేశాలను లోకసేవా భవన్ లో నిర్వహిస్తామని ఒడిశా అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్ర చెప్పారు.
Latest News