by సూర్య | Sat, Mar 28, 2020, 01:28 PM
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ నుండి రక్షణ కోసం వాడుతున్న మాస్కులకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా త్రిపురా సీఎం బిప్లాబ్ కుమార్ డెబ్ కరోనా వైరస్ నుంచి తమని తాము రక్షించుకొనేందుకు ప్రజలు బయటకు వెళ్లే సమయంలో మాస్కులతో పని లేదని, మనం సాధారణంగా ఇంట్లో వినియోగించే తువ్వాలు ధరించిన సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మందికి మాస్కులు పంచడం సాధ్యపడదని, అందుకు బదులుగా తడిపిన తువ్వాలు కట్టుకోవాలని సీఎం సూచించారు.
Latest News