by సూర్య | Sat, Mar 28, 2020, 01:19 PM
దేశంలో కరోనా వైరస్ ప్రబలుతుండటంతోపాటు 21 రోజులపాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో చిక్కుకున్న జర్మనీ ప్రవాసులను ఫ్రాంక్ఫర్ట్కు తరలించేందుకు ఎయిర్ ఇండియా వచ్చే వారం 9 ప్రత్యేక విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ముంబైలో చిక్కుకున్న వందలాది మంది జర్మనీ వాసులను మార్చి 31 నుంచి ఏప్రిల్ 3వతేదీల మధ్య నడిపే ప్రత్యేక విమానాల్లో ఫ్రాంక్ఫర్ట్ నగరానికి తరలించనున్నారు
Latest News