ఏపీలో 13కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

by సూర్య | Sat, Mar 28, 2020, 09:12 AM

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. విశాఖలో ఒకరికి,గుంటూరులో మహిళకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ రెండు కేసులు కూడా ప్రైమరీ కాంటాక్ట్ కేసులే. ఈ ఇద్దరు గతంలో కరోనా వచ్చిన పేషంట్లను కలిసినట్టుగా అధికారులు గుర్తించారు. శుక్రవారం రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. ఈ 13 కేసులలో ఒకరు కోలుకోని డిశ్చార్జి అయ్యాడు. మిగిలిన 12 మందికి చికిత్స అందిస్తున్నారు.రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు.

Latest News

 
మోసాల బాబుకు ఓటేయ‌కండి Mon, Apr 29, 2024, 10:22 AM
సుప‌రిపాల‌న‌కు ప్రాధాన్య‌త కల్పించాం Mon, Apr 29, 2024, 10:21 AM
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం Mon, Apr 29, 2024, 10:20 AM
రుణమాఫీ అంటూ రైతులను మోసం చేశారు Mon, Apr 29, 2024, 10:19 AM
చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల Mon, Apr 29, 2024, 10:18 AM