by సూర్య | Sat, Mar 28, 2020, 09:09 AM
ఏపీ,తెలంగాణ సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద గల కృష్ణానది బార్డర్ లో రెండు రోజుల క్రితం ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి ఆంధ్రలోకి వచ్చేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల పై వాహనదారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది.
Latest News