by సూర్య | Fri, Mar 27, 2020, 01:29 PM
కరోనా ప్రభావంతో అన్ని రాష్ట్రాల్లో కూడా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో తమిళనాడు,యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు 1 నుంచి 9వ తరగతి విద్యార్దులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఏపీ సర్కార్ కూడా 6 నుంచి 9వ తరగతి విద్యార్దులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కూడా కరోనా ప్రభావంతో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ విద్యాశాఖ కూడా 1 నుంచి9వ తరగతి విద్యార్దులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఆలోచన చేస్తునట్టు సమాచారం.దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు సర్కార్ తో సంప్రదింపులు చేస్తునట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ కానునట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. పరిస్థితుల బట్టి దానిని పొడిగించే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎండలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో సర్కార్ పరీక్షలు లేకుండానే విద్యార్దులను ప్రమోట్ చేసే ఆలోచన చేస్తునట్టు సమాచారం. 10వ తరగతి విద్యార్దులకు పరిస్థితులను బట్టి నూతన షెడ్యూల్ ను ప్రకటించునున్నారు.
Latest News