by సూర్య | Fri, Mar 27, 2020, 12:47 PM
కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలలో బ్రిటన్ పురోగతిని సాధించింది. కాగా వ్యాధిని వేగంగా గుర్తించగల సరికొత్త కిట్ను బ్రిటన్లోని ఈస్ట్ ఆంగ్షియా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆవిష్కరించారు. ఈ పరికరం కేవలం 50 నిమిషాల్లోనే రోగ నిర్ధారణ జరుపుతుంది. వ్యక్తుల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో ఆర్ఎన్యేను విశ్లేషించడం ద్వారా తన పనిని పూర్తి చేస్తుంది. ఇందులో ఒకేసారి 16 నమూనాలను పరీక్షించవచ్చు. స్మార్ట్ఫోన్తో అనుసంధానమై పనిచేసే ఈ కిట్ను నిపుణులు తమ వెంట తీసుకెళ్లవచ్చు. కాగా రానున్న రెండు వారాల్లోగా అది విపణిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Latest News