క్వారంటైన్‌కు ఇళ్ళు ఇవ్వండి

by సూర్య | Fri, Mar 27, 2020, 12:45 PM

చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్వారంటైన్‌ కోసం ఉపయోగించని ప్రైవేటు హాస్టళ్లు, గృహాలు ఉంటే ఇచ్చి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి రాష్ట్రానికి దాదాపు 54వేల మంది వచ్చారని సమాచారం. వారందరిపైనా ఆరోగ్యశాఖ ప్రత్యేక నిఘా పెట్టి, క్వారంటైన్‌లో ఉంచింది. ఈ నేపథ్యంలో చెన్నైలో క్వారంటైన్‌ వైద్య సేవల కోసం మరిన్ని ప్రదేశాలు అవసరమని, అందువల్ల ఉపయోగించని వసతి గృహాలు, ఇళ్లు ఉంటే ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు.

Latest News

 
ఆధ్యాత్మిక కేంద్రంలోతీరని డ్రైనేజీ సమస్యలు Fri, May 17, 2024, 02:56 PM
ఉప్పర సగర విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు Fri, May 17, 2024, 02:55 PM
గుర్తుతెలియని వ్యక్తి మృతి Fri, May 17, 2024, 02:49 PM
చిలమత్తూరు ఎంపీపీ, మరో 35 మందిపై కేసు Fri, May 17, 2024, 02:45 PM
ఎం పి ఎల్ ట్రోఫీ ఆవిష్కరణ Fri, May 17, 2024, 02:31 PM