by సూర్య | Fri, Mar 27, 2020, 12:43 PM
అమెరికాలోని భారత సంతతికి చెందిన ప్రముఖ చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ కరోనా మహమ్మారి కోరలకు చిక్కి మృత్యువాత పడ్డారు. 59 ఏళ్ల చెఫ్ ఫ్లాయిడ్ కార్డోజ్ న్యూజెర్సీలో బుధవారం కన్నుమూసినట్టు ఆయన కుటుంబం వెల్లడించింది. బోంబే క్యాంటీన్, ఓ పెర్డో సహా ముంబైలోని రెండు రెస్టారెంట్లకు ఆయన సహ యజమానిగా ఉన్నారు. ఇటీవలే ఆయన తన మూడో వెంచర్ బోంబే స్వీట్ షాప్ కూడా ప్రారంభించారు. మార్చి 8 వరకు ముంబైలోనే ఉన్న కార్డోజ్... చివరిసారి ఈ నెల 18న సోషల్ మీడియాలో స్పందించారు. తాను మార్చి 8న వైద్య చికిత్స కోసం తిరిగి అమెరికా వచ్చాననీ.. అయితే కొద్దిగా జ్వరంగా ఉన్నట్టు అనిపించడంతో న్యూయార్క్లోని ఓ ఆస్పత్రిలో చేరానని ఆయన పేర్కొన్నారు. అయితే వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. చివరకు ఆయన ఆ మహమ్మారికి బలయ్యారు
Latest News