by సూర్య | Thu, Mar 26, 2020, 02:32 PM
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన వారి కోసం లక్షా 70 వేల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పేదల ఖాతాలలోని నేరుగా సొమ్ము జమ అవుతుందని పేర్కొన్నారు. అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందికి రూ.50లక్షలు బీమా ప్రకటించారు. దేశ ప్రజలకు ఆహార భద్రత తప్పని సరిగా కల్పిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. కరోనాను అరికట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని చెప్పారు. దేశ ప్రజలెవరూ ఆకలితో ఉండకూడదన్నారు. ఆకలి చావులు లేకుండా అన్ని ఏర్పాట్లూ చేశామన్ననారు. రోజు కూలీలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. కరోనా కట్టడి కోసం పని చేస్తున్న వైద్య సిబ్బందిని నిర్మలా సీతారామన్ అభినందించారు.
Latest News