by సూర్య | Thu, Mar 26, 2020, 02:29 PM
ఏపీ సర్కార్ కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్దులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందున విద్యార్దులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా విద్యార్దులకు మధ్యాహ్నా భోజనం ఇంటి వద్దకే అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. 10వ తరగతి విద్యార్దులకు ఏప్రిల్14 తర్వాత పరిస్థితిని సమీక్షించి కొత్త పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
Latest News