by సూర్య | Wed, Mar 25, 2020, 03:39 PM
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం రాత్రి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న నోవెల్ కరోనా వైరస్ను ‘‘చైనా వైరస్’’ అని పిలవొద్దంటూ భారత్కు చైనా విజ్ఞప్తి చేసింది. అలా పిలవడం వల్ల చైనా ప్రతిష్టకు భంగం వాటిల్లుందనీ, అంతర్జాతీయ సహకారానికి హానికలిగించే అవకాశం ఉందని అభ్యర్థించింది. కరోనా వైరస్ను ‘‘చైనా వైరస్’’ అంటూ అమెరికా అధ్యక్షుడు ఇటీవల పదే పదే పేర్కొన్న నేపథ్యంలో చైనా ఈ మేరకు విన్నవించడం గమనార్హం.
Latest News