by సూర్య | Wed, Mar 25, 2020, 03:52 PM
స్వార్థంతో సీఎం జగన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని టీడీపీ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు. జగన్రెడ్డి ప్రతి నిర్ణయంపై కోర్టులు అక్షింతలు వేస్తున్నాయని, రంగుల పథకానికి రూ. 1350 కోట్లు ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని భూముల పంపిణీ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టిందని, కరోనా వైరస్పై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కరోనాతో ఉపాధి కోల్పోయినవారికి 5 వేల చొప్పున ఇవ్వాలని రాజా డిమాండ్ చేశారు.
Latest News