by సూర్య | Sat, Mar 21, 2020, 05:57 PM
బిఎస్ఎన్ఎల్ సంస్థ ఓ క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. కరోనా నేపథ్యంలో ఇప్పడు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం బ్రాడ్బ్యాండ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లో ల్యాండ్ లైన్ కస్టమర్లందరికీ ఉచితంగా నెల రోజుల పాటు ఈ సేవలను అందించనుంది. కాగా.. ఎయిర్టెల్, జియో వంటి ప్రైవేట్ ప్రొవైడర్లు.. ఇతర ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లతో పోటీ పడటానికి ఈ ఆఫర్ సహాయపడుతుందని సంస్థ భావిస్తోంది. 'కరోనావైరస్'ని అరికట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ విధానాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. దీన్ని ప్రోత్సహించడానికి బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ని ప్రకటించినట్లు'.. బిఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సీఎఫ్ఏ వివేక్ బంజాల్ పేర్కొన్నారు.
బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉన్న, బ్రాండ్ బ్యాండ్ లేని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ ఈ సేవలను.. ఒక నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్ఎస్ డౌన్ స్పీడ్ను, 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ సంస్థ. ఒకవేళ డేటా పరిమితి అయిపోతే.. డేటా వేగం కోసం 1 ఎంబీపీఎస్కు పరిమితమవుతుంది. ఈ కొత్త ఆఫర్ ద్వారా ఇంటి నుండి పని చేసుకోవడానికి, ఆన్లైన్ క్లాసెస్ ద్వారా విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించవచ్చని బిఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సీఎఫ్ఏ వివేక్ బంజాల్ తెలిపారు.