పెద్దలు ఒప్పుకోలేదని..ప్రేమ జంట ఆత్మహత్య

by సూర్య | Sat, Mar 21, 2020, 03:41 PM

ఇంట్లో పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా ఆలంగాయం సమీపంలోని పూంగాపుదూరు గ్రామానికి చెందిన ఉమాపతి కుమార్తె నందిని. ఆమెకు 22 సంవత్సరాలు. గుడియాత్తం సామర్షికుప్పం గ్రామానికి చెందిన కోదండన్ కుమారుడు రామదాస్. ఆయనకు 29 సంవత్సరాలు. వీరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. రామదాస్ హోసూరులోని వెల్డింగ్ దుకాణంలో పని చేస్తున్నాడు. వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పారు. కానీ వీరి ప్రేమకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు.
దీంతో ఈ ప్రేమ జంట గురువారం రాత్రి ఇంట్లో నుంచి బయటికి వచ్చింది. ఆంబూరు సమీపంలోని పచ్చకుప్పం రైల్వే పట్టాల వద్దకు చేరుకుంది. అనంతరం అక్కడ ఈ జంట మాట్లాడుకుంది. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఈ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. చెన్నై- బెంగళూరు వెళ్లే రైలు పట్టాల పై పడుకొని సెల్ఫీ తీసుకుంది. వీరిని చెన్నై నుంచి వచ్చే రైలు ఢీకొంది. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
శుక్రవారం ఉదయం ఈ ప్రేమ జంటను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సమచారం అందుకున్న జోలార్ పేట రైల్వే పోలీసులు, ఆంబూరు డీఎస్పీ సదానందం అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM