by సూర్య | Sat, Mar 21, 2020, 03:34 PM
కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. జిల్లాల వారీగా వైరస్ వ్యాప్తి పర్యవేక్షణకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కరోనా వ్యాప్తి నిరోధానికి జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించిన సర్కారు.. వారి నేతృత్వంలోనే కలెక్టర్, ఎస్పీ సహా 18 మందితో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్గా జిల్లా కలెక్టర్, మెంబర్ కన్వీనర్గా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని నియమించింది. వైస్ చైర్మన్గా జేసీ - 1, సభ్యుడిగా జేసీ - 2, ఆరోగ్య సేవల జిల్లా సమన్వయకర్తగా ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ వ్యవహరిస్తారు. డీటీఓ, డీఎస్ఓ, డీపీఓ, డీఈఓ, డీఆర్డీఏ పీడీ, ఆర్టీసీ ఆర్ఎంలు సైతం సభ్యులుగా ఉంటారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో సభ్యులుగా మున్సిపల్ కమిషనర్లు, ఐసీడీఎస్ పీడీ, రైల్వే, విమానాశ్రయాల ప్రతినిధులను టాస్క్ఫోర్స్లో భాగం చేశారు.
Latest News